ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైరలవుతున్న పూరి జగన్నాధ్ లీక్డ్ ఫోన్ కాల్ సంభాషణ

cinema |  Suryaa Desk  | Published : Tue, Oct 25, 2022, 03:52 PM

డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం కెరీర్ లో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తీసిన "లైగర్" డిజాస్టర్ కావడంతో పూరికి ఈ పరిస్థితి ఏర్పడింది.


విడుదలకు ముందు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా విడుదల తరవాత ఘోర పరాజయం పాలవ్వడంతో బయ్యర్లకు తీవ్ర నష్టాలు మిగిలాయి. దీంతో బయ్యర్లకు లైగర్ మేకర్స్ కంపెన్సేట్ చేస్తున్నారు.


ఐతే, తాజాగా లైగర్ బయ్యర్లు ధర్నా చేస్తామని పూరీని బెదిరిస్తున్నారు. ఈమేరకు బయ్యర్లతో పూరి మాట్లాడిన ఫోన్ కాల్ సంభాషణ నెట్టింట హల్చల్ చేస్తుంది. ఇందులో పూరి ... నిజానికి మీకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. కానీ ఇస్తున్నాను. సినీ పరిశ్రమలో నా పరువు పోకూడదని ఇస్తున్నాను. ఆల్రెడీ ఒక సెటిల్మెంట్ కు వచ్చి, అగ్రీ అయ్యాక ఇప్పుడు ధర్నా చేస్తానని బెదిరిస్తున్నారు. ఇలా అతిచేస్తే ఇచ్చే డబ్బులు కూడా ఇవ్వబుద్ది కాదు. నా పరువు తియ్యాలని ధర్నా చేస్తే...  చెయ్యండి... ఎవరైతే ధర్నా చేస్తారో... వారికీ తప్ప మిగిలిన వారికి డబ్బులు ఇస్తాను... అని మాట్లాడుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa