ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కృష్ణవంశీ మాస్టర్ పీస్ "గులాబీ" కి ఇరవైఏడేళ్ళు ..!!

cinema |  Suryaa Desk  | Published : Thu, Nov 03, 2022, 06:47 PM

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్టోరియల్ డెబ్యూ మూవీ 'గులాబీ' విడుదలై నేటితో ఇరవై ఏడేళ్లను పూర్తి చేసుకుంది. యాక్షన్ ప్యాక్డ్ ఇంటెన్స్ లవ్ స్టోరీ గా రూపొందిన ఈ సినిమా 1995 నవంబర్ 3న విడుదలై, క్లాసిక్ హిట్ గా నిలిచింది.


విమర్శాత్మక దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమాను నిర్మించగా, అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ సహనిర్మాతగా వ్యవహరించింది. జేడీ చక్రవర్తి, మహేశ్వరి జంటగా నటించిన ఈ సినిమాకు శశి ప్రీతం సంగీతం అందించారు.


ఇప్పటికీ ఈ సినిమాలోని 'ఈవేళలో నీవూ ... ఏం చేస్తు ఉంటావో....' అనే రొమాంటిక్ సాంగ్ ఎవర్గ్రీన్ అని చెప్పొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa