ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొత్త రూమర్ః రాజమౌళి సినిమా రెండు భాగాల‌ట‌?!

cinema |  Suryaa Desk  | Published : Sat, Dec 29, 2018, 02:06 AM

రాజమౌళి, ఎన్‌టి‌ఆర్ చరణ్ సినిమాకు సంభందించిన కొత్త రూమర్ బయటికి వచ్చింది. విషయం ఏంటంటే.. రాజమౌళి ఈ సినిమాను రెండు పార్ట్శ్ గా తీయ్యబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. అధికారికంగా ఈ న్యూస్ కు సంభందించి ఎక్కడా చిత్ర యూనిట్ ప్రకటించలేదు. 2020 వేసవిలో ఈ సినిమాను విడుదల చెయ్యడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నారు. చరణ్, ఎన్‌టి‌ఆర్ ఈ సినిమా కోసం వచ్చే ఏడాది అక్టోబర్ వరుకు డేట్స్ కేటాయించినట్లు తెలుస్తోంది. అక్టోబర్ వరుకు వీరిద్దరు ఈ సినిమా కాకుండా వేరే సినిమా ఒప్పుకోరు. అక్టోబర్ నుండి మార్చి వరుకు పోస్ట్ ప్రొడక్షన్ చేసి మే 2020లో చిత్రాన్ని విడుదల చెయ్యనున్నారు. జనవరి 19 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇది రెండో షెడ్యూల్. మొదటి షెడ్యూల్ లో ఎన్‌టి‌ఆర్ ఎక్కువ రోజులు నటించాడు, చరణ్ ఐదు రోజులు మాత్రమే పాల్గొన్నాడు. సెకండ్ షెడ్యూల్ నుండి ఇద్దరు కలిసి నటించబోతున్నారు. ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఎవరనేది రాజమౌళి సంక్రాంతికి ప్రకటించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa