సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న మూడవ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. దీంతో ఈ సినిమా అప్డేట్లపై ఫ్యాన్స్ కుతూహలంగా ఉన్నారు. ఈ మేరకు ఒక న్యూస్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
సూపర్ స్టార్ తల్లి ఇందిరా దేవిగారు ఆకస్మిక మరణం చెందడంతో కాస్త వెనక్కి జరిగిన ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ నవంబర్ ఆఖరి వారంలో స్టార్ట్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. డిసెంబర్ వరకు ఈ షెడ్యూల్ ను రన్ చేసి, మేజర్ పార్ట్ ను పూర్తి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.