పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో కార్తీ నటించిన 'సర్దార్' సినిమా విడుదలై గ్రాండ్ సక్సెస్తో బాక్స్ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లు వసూళ్లు చేసి సెన్సషనల్ రికార్డుని సృష్టించింది. తాజాగా ఇప్పుడు కార్తీ 25వ చిత్రం చెన్నైలో ప్రారంభమైంది. ఈ సినిమాకి 'జపాన్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసి గ్రాండ్ గా లాంచ్ చేసారు. రాజుమురుగన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుంది.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలను మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa