ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన "పుష్ప ది రైజ్" సినిమా గతేడాది డిసెంబర్ 17న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి కాసుల వర్షం కురిపించింది. ఈ మూవీ మ్యూజిక్ ఆల్బమ్ కూడా చార్ట్బస్టర్గా నిలిచింది. ఈ మాస్ ఎంటర్టైనర్ సినిమా 2021లో అతిపెద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. ఈ సినిమాలో సునీల్, రావు రమేష్, అనసూయ, ఫహద్ ఫాసిల్ కీలక పాత్రలో కనిపించరు. ఇప్పుడు, అందరూ 'పుష్ప 2' కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, డిసెంబర్ 17న పుష్ప కేరళలో రీ-రిలీజ్ అవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తేదీకి ఈ చిత్రం విడుదలై ఒక సంవత్సరం పూర్తి చేసుకోగా, ఐకాన్ స్టార్కి కోటగా ఉన్న కేరళలో ఇది తిరిగి థియేటర్లలోకి రానుంది అని సమాచారం. E4E గ్రూప్ కేరళలో ఈ సినిమాను మళ్లీ విడుదల చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి డీఎస్పీ సంగీతం అందించారు.