కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటిస్తున్న స్పోర్ట్స్ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ "మట్టి కుస్తీ". మాస్ రాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. తమిళంలో గట్ట కుస్తీ పేరుతో విడుదల కాబోతుంది.
తాజా సమాచారం ప్రకారం, మట్టి కుస్తీ/ గట్ట కుస్తీ పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేసారు.
జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించిన ఈ సినిమా డిసెంబర్ 2న అంటే ఈ శుక్రవారం తెలుగు, తమిళ భాషలలో గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa