ప్రముఖ టాలీవుడ్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు "వారిసు" సినిమాతో కోలీవుడ్ నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే కదా. ఈ సినిమాకు వంశీ పైడిపల్లి డైరెక్టర్ గా వ్యవహరిస్తుండగా, తలపతి విజయ్, రష్మిక మండన్నా జంటగా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, వారిసు మూవీ హిందీలో కూడా విడుదల కాబోతుంది. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో దిల్ రాజు స్వయంగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ సడన్ సర్ప్రైజ్ న్యూస్ ఆడియన్స్ కు షాక్ ఇస్తుంది. తెలుగులో "వారసుడు" టైటిల్ తో రాబోతున్న ఈ సినిమా హిందీ వెర్షన్ కి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతికి తెలుగు, తమిళ భాషలలో పాటుగా హిందీలో ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.