ZEE5 ప్రకటించిన 'అహ నా పెళ్లంట' సిరీస్ తో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ OTT ప్లాట్ఫారంలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి అందరికి తెలిసిన విషయమే. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ ట్రాక్ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ లో రాజ్ తరుణ్ శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ZEE5లో ప్రీమియర్గా ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సిరీస్ OTT ప్లాట్ఫారమ్లో 75 మిలియన్ నిమిషాల పాటు స్ట్రీమ్ చేయబడింది. అంతేకాకుండా ప్రస్తుతం భారతదేశంలోని ZEE5 వెబ్ సిరీస్ చార్ట్లలో రెండవ స్థానంలో ట్రెండింగ్లో ఉంది. ZEE5 అండ్ తమడ మీడియాఈ వెబ్ సిరీస్ ని నిర్మిస్తుంది.
8 ఎపిసోడ్లు కలిగి ఉన్న ఈ వెబ్ సిరీస్ లో ఆమని, హర్షవర్ధన్, పోసాని కృష్ణ మురళి, గెటప్ శ్రీను, జబర్దష్ రాజమౌళి, తాగుబోతు రమేష్, మధునందన్, భద్రమ్ మరియు రఘు కరమంచి, దొరబాబు. కీలక పాత్రలలో నటిస్తున్నారు. రాహుల్ తామాడ, సాయిదీప్రెడ్డి బుర్రా ఈ సిరీస్ని నిర్మిస్తున్నారు.