MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ హీరో నితిన్ నటించిన 'మాచర్ల నియోజకవర్గం' సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యి ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఎట్టకేలకు ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ తేదీని లాక్ చేసింది. ఈ చిత్రం డిసెంబర్ 9న ZEE5లో ప్రసారానికి అందుబాటులోకి రానుంది.
నితిన్ సరసన ఈ సినిమాలో కృతి శెట్టి అండ్ కేథరిన్ త్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పొలిటికల్ ఎలిమెంట్స్తో పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ సినిమాని ఆదిత్య మూవీస్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ నిర్మించింది.