ట్రెండింగ్
Epaper    English    தமிழ்

50 మిలియన్ల స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసిన 'ఊర్వశివో రాక్షశివో'

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 12, 2022, 08:41 PM

రాకేశ్ శశి దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటించిన 'ఊర్వశివో రాక్షశివో' చిత్రం గ్రాండ్ గా థియేటర్లలో విడుదలైంది. ఇటీవల ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ డిసెంబర్ 9, 2022న నెట్‌ఫ్లిక్స్ మరియు ఆహాలో ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు, ఈ సినిమా ఆహాలో ప్రీమియర్ గా విడుదలైన 48 గంటల్లోనే ఈ సినిమా 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను నమోదు చేసినట్లు సమాచారం.


ఈ చిత్రంలో అల్లు శిరీష్ కి జోడిగా అను ఇమ్మాన్యుయేల్ నటించింది. వెన్నెల కిషోర్, సునీల్, ఆమని, కేదార్ శంకర్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని మరియు విజయ్ ఎం. అచ్చు రాజమణి నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa