ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మున్నాభాయ్‌తో శంకర్ దాదా

cinema |  Suryaa Desk  | Published : Thu, Jan 10, 2019, 11:05 PM

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినయ విధేయ రామ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కొన్ని రోజులుగా రాంచరణ్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే విడుదలైన వినయ విధేయ రామ ట్రైలర్ మాస్ ప్రేక్షకులని ఆకర్షిస్తోంది. బాలీవడ్ స్టార్ సంజయ్ దత్ ని రాంచరణ్ తాజాగా కలవడం ఆసక్తిగా మారింది.
రాంచరణ్, చిరంజీవి ఇద్దరూ సంజయ్ దత్ ని మీట్ కావడం విశేషం. ఓ కార్యక్రమంలో భాగంగా వీరు ముగ్గురూ కలిసినట్లు తెలుస్తోంది. క్రేజీ స్టార్స్ ముగ్గురూ ఒక ప్రేములో కనిపించడంతో ఫోటోలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. వీరు ముగ్గురూ కలసి సరదాగా సంభాషించుకుంటున్నారు.
సంజయ్ దత్ నటించిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ చిత్రాన్ని చిరు తెలుగులో శంకర్ దాదా ఎంబిబిఎస్ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి చిరు, సంజయ్ దత్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. తాజాగా రాంచరణ్ కూడా సంజయ్ దత్ ని కలవడం ఆసక్తిగా మారింది. సంజయ్ దత్ భాయ్ తో మిస్టర్ సి మాట్లాడుతున్నారు. వీరిద్దరూ కలసిన సాయంత్రం ఎప్పటికి గుర్తుండిపోతుంది అని ఉపాసన ట్వీట్ చేసింది.
ఇటీవల రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో నటించడం గురించి స్పందించాడు. గతంలో రాంచరణ్ జంజీర్ చిత్రం తో చేసిన ప్రయత్నం విఫలం చెందిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లోనే బాలీవుడ్, హాలీవుడ్ స్థాయి చిత్రాలు నిర్మించబడుతున్నాయి. అలాంటప్పుడు బాలీవుడ్ తో అవసరం లేదు అని తేల్చేశాడు.
వినయ విధేయ రామ చిత్రం రేపే విడుదల కానుండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది.. సంక్రాంతి బరిలో ఈ చిత్రం నిలవడంతో తొలిరోజు ఓపెనింగ్స్ పై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa