గోపీచంద్ మలినేని డైరెక్షన్లో బాలకృష్ణ, శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్న చిత్రం "వీరసింహారెడ్డి". ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లకు రాబోతుంది.
తాజా బజ్ ప్రకారం, రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల సుదీర్ఘ నిడివితో సెన్సార్ బృందం నుండి వీరసింహారెడ్డి సినిమా యూ/ఏ సెర్టిఫికేట్ తెచ్చుకుందని టాక్. కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వీరసింహారెడ్డి సినిమా లెందీ రన్ టైం ఫిక్స్ చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఐతే, మేకర్స్ నుండి ఈ విషయంపై అఫీషియల్ క్లారిటీ రావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa