మన ఇళ్లల్లో గోధుమ పిండి, మైదా పిండి వాడకం ఎక్కువగా ఉంటుంది. గోధుమ పిండితో చేసిన చపాతీలు, రొట్టెలను ఎక్కువగా తింటుంటారు. కొందరు పండగల సమయంలో పూరీలు, కచోరీలు తయారికీ పిండిని ఉపయోగిస్తుంటారు. చాలా మంది మార్కెట్ నుంచి గోధుమ పిండిని కొనుగోలు చేస్తుంటారు. మరికొందరు మిల్లు నుంచి గోధుమల్ని ఆడించి పిండిని ఇంటికి తీసుకువస్తుంటారు.
అయితే పిండి విషయంలో చాలా మంది ఓ సమస్యను తరచుగా ఎదుర్కొంటారు. అదే పిండికి పురుగులు పట్టడం. వర్షం లేదా వేడి వాతావరణంలో పిండిలో తెల్లటి పురుగులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని వీవిల్స్ అంటారు. పిండికి ఈ తెల్లటి చిన్న పురుగులు ఎక్కువగా పడితే అది పాడైపోతుంది. అంతేకాకుండా పురుగు పట్టిన పిండితో చపాతీలు చేసుకోవడానికి చాలా మంది ఇష్టపడరు. అయితే, పిండికి పురుగులు ఎందుకు పడతాయి, ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పిండిలో పురుగులు ఎందుకు పడతాయి?
పిండిలో పురుగులు లేదా కీటకాలు రావడానికి ప్రధాన కారణం తేమ.
మారుతున్న వాతావరణంలో.. ముఖ్యంగా చలి కాలం నుంచి ఎండాకాలం వచ్చేటప్పుడు లేదా వర్షాకాలంలో గాలిలోని తేమ వల్ల పిండికి పురుగులు పడతాయి.
చలికాలం నుంచి వేసవికి సీజన్ మారుతున్నందున పురుగులు చల్లదనాన్ని కోరుకుని పిండికి పడతాయి.
ఈ పురుగుల్ని పిండిని జల్లెడ పట్టడం ద్వారా మాత్రమే శుభ్రం చేయవచ్చు. అయితే, ఇది సమయం తీసుకునే ప్రక్రియ. కొన్ని చిట్కాల సాయంతో పిండి నుంచి పురుగుల్ని తరిమికొట్టొచ్చు.
తేమను తొలగించడానికి ఎండలో ఉంచండి
తేమ కారణంగా పిండిలో పురుగులు లేదా కీటకాలు ఏర్పడతాయి. అందుకోసం మీరు వారానికి ఒకసారి ఒకటి లేదా రెండు గంటలు పిండిని ఎండలో ఉంచాలి. సూర్యరశ్మి తేమను తొలగిస్తుంది. పురుగులు పట్టకుండా నిరోధిస్తుంది. మీరు తక్కువ స్థాయిలో పురుగులు చూసిన వెంటనే పిండిని ఎండలో ఉంచండి. ఇందుకోసం పిండిని ఒక వెడల్పాటి పాత్రలో పోసి కనీసం 2-3 గంటలు ఎండలో ఉంచండి. ఎండ వేడికి పురుగులు బయటకు పారిపోతాయి.
పురుగుల్ని వదిలించే ఇతర పద్ధతులు
సన్నని జల్లెడ: సన్నని రంధ్రాలు ఉన్న జల్లెడతో పిండిని జల్లించండి. ఇలా చేయడం వల్ల పురుగులు, వాటి గుడ్లు కూడా వేరు చేయబడతాయి.
బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి: పిండి నిల్వ చేసే డబ్బాలో కొన్ని బిర్యానీ ఆకులు, ఎండుమిర్చి ఉంచండి. వీటి ఘాటైన వాసనకు పురుగులు దరిచేరవు.
ఫ్రిజ్లో ఉంచడం: పిండిని ఒక కవర్లో కట్టి కొన్ని గంటల పాటు ఫ్రిజ్లో ఉంచండి. ఆ చల్లదనానికి పురుగులు, గుడ్లు చనిపోతాయి.
పిండికి పురుగు పట్టకుండా పాటించాల్సిన చిట్కాలు
పిండికి పురుగు పట్టకుండా పాటించాల్సిన చిట్కాలు
లవంగాలు: పిండి డబ్బాలో అక్కడక్కడ కొన్ని లవంగాల్ని ఉంచండి. వీటిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీంతో పురుగులు పట్టవు.
గాలి చొరబడని డబ్బాలు: పిండిని ఎప్పుడూ బాగా మూసి ఉంచిన డబ్బాల్లో ఉంచాలి. మూత గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
వేపాకులు: బాగా ఎండిన వేపాకుల్ని ఒక చిన్న గుడ్డలో కట్టి పిండి మధ్యలో ఉంచితే పురుగులు అస్సలు రావు.
ఉప్పు పొట్లం: ఒక చిన్న గుడ్డలో కొంచెం కల్లు ఉప్పును కట్టి పిండి డబ్బాలో ఉంచండి. ఇది పిండిలోని తేమను పీల్చుకుని పురుగులు పట్టకుండా చూస్తుంది.
వెల్లుల్లి రెబ్బలు: పొట్టు తీయని వెల్లుల్లి రెబ్బల్ని పిండిలో వేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
గుర్తించుకోవాల్సిన విషయాలు
గుర్తించుకోవాల్సిన విషయాలు
పిండిని ఒకేసారి భారీ మొత్తంలో నిల్వ చేసుకోకుండా చూసుకోండి.
అవసరమైనంత తక్కువ మొత్తంలో కొనుగోలు చేయడం లేదా ఆడించుకోవడం ఉత్తమం.
పాత పిండిలో పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అందుకే పిండిని కొనుగోలు చేసేటప్పుడు ఓ సారి చెక్ చేసుకోవడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa