నేషనల్ క్రష్ రష్మిక మండన్నా హిందీ లో నటించిన రెండవ చిత్రం "మిషన్ మజ్ను". ఇందులో హీరో సిద్దార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో కాకుండా డైరెక్ట్ ఓటిటిలో రిలీజ్ అవ్వడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. ఈ మేరకు జనవరి 20, 2023న ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో మిషన్ మజ్ను రిలీజ్ కాబోతుంది.
లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ ప్రకారం, మరో నాల్రోజుల్లో అంటే జనవరి 9న మిషన్ మజ్ను ట్రైలర్ విడుదల కాబోతుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
శంతను బాగ్చి డైరెక్టోరియల్ లో పేట్రియాటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాను రోన్ని స్క్రూవాలా, అమర్ బుటల , గరిమ మెహతా నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa