గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాకి 'వీర సింహారెడ్డి' అనే టైటిల్ ని లాక్ చేసారు. వీరసింహా రెడ్డి జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్ జనవరి 6, 2023న ఒంగోలులోని ABM గ్రౌండ్స్లో జరగాల్సి ఉంది. కొన్ని సమస్యల కారణంగా, ఒంగోలులోని అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ని నిర్వహించాలని వీరసింహారెడ్డి మూవీ టీమ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ఒక పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు.
ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa