కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని దర్శకుడు హెచ్ వినోద్ అండ్ నిర్మాత బోనీ కపూర్తో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ చిత్రానికి 'తునివు' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ చిత్రాన్ని తెలుగులో 'తెగింపు' పేరుతో విడుదల చేస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఈ హీస్ట్ డ్రామా జనవరి 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజగా ఇప్పుడు, ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 3.20 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం.
ఈ సినిమాలో అజిత్ కి జోడిగా మంజు వారియర్ నటిస్తుంది. సంజయ్ దత్, సముద్రఖని, మహానటి శంకర్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్కు సినీ ప్రేమికుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాని బోనీ కపూర్ తన హోమ్ బ్యానర్ బే వ్యూ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పిపై నిర్మించారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందించారు.
'తునివు' AP/TS బిజినెస్ ::::::
నైజాం : 1.20 కోట్లు
సీడెడ్ : 0.40 కోట్లు
ఆంధ్రాప్రదేశ్ : 1.60 కోట్లు
టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ కలెక్షన్స్ : 3.20 కోట్లు
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa