గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా విడుదలైనా అన్ని చోట్ల పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొని సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది.
లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా సెడెడ్లో నిన్న1.5 కోట్లు వసూళ్లు చేసినట్లు సమచారం. ఇప్పటివరకు ఈ సినిమా 7.6 కోట్ల షేర్ రాబట్టింది. బాలయ్య కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. ఈ వారాంతంలో ఈ సినిమా మరింత వసూళ్లు రాబడుతుందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.
ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్, నవీన్ చంద్ర మరియు అజయ్ ఘోష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.