కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశీ జంటగా, మురళీ కిషోర్ అబ్బురు డైరెక్షన్లో రూపొందుతున్న ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ "వినరో భాగ్యము విష్ణుకథ". ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మురళి శర్మ కీరోల్ లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుండి సెకండ్ సింగిల్ 'ఓహ్ బంగారం' లిరికల్ వీడియో విడుదలైంది. హీరో హీరోయిన్ల మధ్య క్యూట్ క్యూట్ గా సాగే ప్రేమగీతంగా, వీక్షకుల హృదయాలను దోచుకుంటూ, విడుదలైన 24 గంటలలోనే 1 మిలియన్ రియల్ టైం వ్యూస్ ను రాబట్టింది. చైతన్ భరద్వాజ్ స్వపరిచిన ఈపాటను కపిల్ కపిలన్ ఆలపించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు.
ఈ సినిమా మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa