రంజిత్ జెయకోడి దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మాకర్స్ 'మైఖేల్' అనే టైటిల్ ని లాక్ చేసారు. మైఖేల్ మూవీ ఫిబ్రవరి 3న ప్రపంచవ్యాప్తంగా అన్ని సౌత్ ఇండియన్ భాషలు మరియు హిందీలో గ్రాండ్ రిలీజ్ కానుంది.
రేపు హైదరాబాద్లోని జెఆర్సి కన్వెన్షన్ సెంటర్లో సాయంత్రం 6 గంటల నుండి ఈ సినిమా ప్రీ-రిలీజ్ జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ఆన్లైన్లో ప్రకటించారు.
దివ్యాంశ కౌశిక్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ పాన్-ఇండియన్ చిత్రం 'మైఖేల్'లో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి అండ్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి నిర్మిస్తుంది.