నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం మూవీ మేకర్స్ ఇప్పుడు సరసమైన టిక్కెట్ ధరల ను ఉంచాలని నిర్ణయించుకున్నారు. తాజా అప్డేట్ ప్రకారం, హైదరాబాద్లోని సింగిల్ స్క్రీన్లకు 110 రూపాయలు వసూలు చేయనున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విలేజ్ డ్రామా చిత్రం ఫిబ్రవరి 18, 2023న మహా శివరాత్రి స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.