నంద కిషోర్ అబ్బురు దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. తాజా అప్డేట్ ప్రకారం, ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తెలుగు రాష్ట్రాల్లో 3.60 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా క్లీన్ హిట్ కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో 4 కోట్ల రేంజ్ లో వసూళ్లు రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.
ఈ సినిమాలో కిరణ్ సరసన కాశ్మీరా పరదేశి జంటగా నటించింది. మురళీ శర్మ, ప్రవీణ్, శుభలేఖ సుధాకర్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ విలేజ్ డ్రామా చిత్రం ఫిబ్రవరి 18, 2023న మహా శివరాత్రి స్పెషల్గా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa