కన్నడ స్టార్ హీరో దర్శన్ తూగుదీప చివరిసారిగా 'క్రాంతి' అనే యాక్షన్ డ్రామాలో కనిపించారు. వి.హరికృష్ణ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో రచితా రామ్ కథానాయికగా నటించింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ప్రముఖ OTT ప్లాట్ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ చిత్రం ఫిబ్రవరి 23, 2023న ప్రీమియర్గా ప్రదర్శించబడుతుందని అధికారకంగా ప్రకటించింది. ఈ చిత్రం OTTప్లాట్ఫారమ్లో తెలుగు, తమిళం మరియు మలయాళ వెర్షన్లలో ప్రత్యేకంగా విడుదల కానుంది.
సుమలత, రవిచంద్రన్, సంపత్ రాజ్, రవిశంకర్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. మీడియా హౌస్ స్టూడియో బ్యానర్పై బి. సురేష, శైలజ నాగ్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa