దర్శకుడు పా రంజిత్తో స్టార్ హీరో విక్రమ్ 'తంగలన్' సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తోంది. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం కోసం ది బీచ్, ది పియానిస్ట్, లారా క్రాఫ్ట్ టోంబ్ రైడర్ మరియు ది క్రెడిల్ ఆఫ్ లైఫ్లో తన పాత్రలకు ప్రసిద్ధి చెందిన ఇంగ్లీష్ నటుడు డేనియల్ కాల్టాగిరోన్ బోర్డు లో ఉన్నట్లు సమాచారం.
ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, పశుపతి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa