గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ నటించిన 'వీర సింహారెడ్డి' సినిమా జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయ్యింది. తాజా అప్డేట్ ప్రకారం, వీర సింహారెడ్డి సినిమా 50 రోజుల నాన్స్టాప్ థియేట్రికల్ రన్ను పూర్తి చేసి అరుదైన మైలురాయిని సాధించింది. వీరసింహా రెడ్డి 23 డైరెక్ట్ మరియు 54 షిఫ్టింగ్ థియేటర్ల నుండి ఈ విజయాన్ని సాధించగా, అంతేకాకుండా ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టింది.
ఈ యాక్షన్ డ్రామా సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి థమన్ ఎస్ సంగీతం అందించారు.