ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయ నేతలపై ‘ఎల్‌కేజీ’ సెటైర్లు

cinema |  Suryaa Desk  | Published : Mon, Feb 04, 2019, 06:20 PM

కమెడియన్‌గా రాణిస్తున్న ఆర్‌జే బాలాజీ హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘ఎల్‌కేజీ’ విడుదలకు సిద్ధమవుతోంది. కేఆర్‌ ప్రభుత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియా ఆనంద్‌ హీరోయిన్‌గా నటించగా, జేకే రితీష్‌, నాంజిల్‌ సంపత్‌ తదితరులు రాజకీయ నేతలుగా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ప్రచారంలో భాగంగా ‘ఎల్‌కేజీ’ ట్రైలర్‌ను శనివారం విడుదల చేయగా, యూట్యూబ్‌లో ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన వస్తోంది. అందుకు ట్రైలర్‌లో రాజకీయనేతలపై సెటైర్లు వేయడమే కారణం. ‘ఎంతకాలం.. ఇంకెంకాలం మోసపోతాము ఈ దేశంలో... మన దేశంలో’ అంటూ సాగే పాట, 3వేల కోట్లతో విగ్రహం, నీరు ఆవిరి కాకుండా ఉండేందుకు ధర్మాకోల్‌, యోగా ఛాలెంజ్‌ వంటి విషయాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ప్రస్తుతం కామెడీగానే చూస్తున్నా, విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాల్ని కొట్టిపారేయలేం అంటున్నారు విశ్లేషకులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa