కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ రొమాన్స్ చేయనుంది. తాజాగా హైదరాబాద్లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో జరిగిన కార్యక్రమంలో మూవీ మేకర్స్ ఈ చిత్రం యొక్క థియేట్రికల్ ట్రైలర్ను ఆవిష్కరించారు.
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న విడుదల కానుంది. ఈ పాన్ ఇండియన్ మిస్టికల్ థ్రిల్లర్లో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.