క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "హరి హర వీర మల్లు" సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ సినిమా సెట్స్లో అగ్ని ప్రమాదం సంభవించింది. వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించేందుకు తెలంగాణలోని దుండిగల్లో వేసిన సెట్ ఈ ప్రమాదంలో దగ్ధమైంది. అదృష్టవశాత్తూ, ఎవరూ గాయపడలేదు అయితే షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి మరింత సమయం పడుతుంది అని సమాచారం.
ఈ చిత్రంలో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, సిజ్లింగ్ బ్యూటీ నోరా ఫతేహి ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాన్-ఇండియా మూవీ ని మెగా సూర్య ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.