సెన్సషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క పోస్ట్ థియేట్రికల్ హక్కులను జీ5 చేజిక్కించుకున్నట్లు లేటెస్ట్ టాక్. OTT, శాటిలైట్ హక్కులు 270 కోట్ల రూపాయలకు భారీగా అమ్ముడయినట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
అరవింద్ స్వామి, ఎస్జే సూర్య, సురేష్ గోపి, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, జయరామ్, సునీల్, హ్యారీ జోష్ మరియు నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. 2024 సమ్మర్లో ఈ సినిమా పెద్ద స్క్రీన్ల పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ మెగా చిత్రానికి థమన్ ఎస్ సౌండ్ట్రాక్స్ అందించనున్నారు. దిల్ రాజు తన హోమ్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa