ప్రస్తుతం సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో చేరిన లేటెస్ట్ సెన్షేషన్ లోకేశ్ కనగరాజ్. చేసినివి నాలుగు సినిమాలే అయినప్పటికీ హీరోల స్థాయి స్టార్ డం అతని సొంతం. మా నగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాల ద్వారా యూత్లో బాగా క్రేజ్ సంపాదించడమే కాక ఎల్సీయూ(లోకేశ్ యూనివర్స్)లో చిత్రాలు ఉంటాయని ప్రకటించి తన సినిమాల రాక రోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసేలా పేరు తెచ్చుకున్నాడు. అలాంటిది ఇప్పుడు లోకేశ్పై తమిళనాట ఓ కేసు బుక్కైంది. 2023 దసరాకు విడుదలైన లియో సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 700 కోట్ల వసూళ్లను కొళ్లగొట్టి సంచలనం సృష్టించింది. అంతేగాక ఇదే సినిమా విషయంలో త్రిషపై మన్సూర్ అలీఖాన్ అసంబద్ద వ్యాఖ్యలు చేయడం దేశమంతటా చర్చకు దారి తీసి కేసుల వరకు వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే లియో సినిమా విషయంలో మదురైకి చెందిన రాజు మురుగన్ అనే ఓ వ్యక్తి లోకేశ్ కనగరాజ్ మానసిక పరిస్థితిని ఓ సారి పరీక్షించండి అంటూ హైకోర్టు మదురై బెంచ్లో ఫిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa