మాస్ కా దాస్ విశ్వక్ సేన్ వైవిధ్యమైన పాత్రలు చేస్తూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే విడుదలైన 'గామి' సినిమాతో తన నటనతో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. ఆ సినిమా విజయవంతం అయింది అని కూడా అంటున్నారు. ఈ విజయంతో విశ్వక్ సేన్ ఇప్పుడు తన తదుపరి సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' లో ఇంకో వైవిధ్యమైన పాత్రతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించబడినందున, ఈ చిత్రాన్ని మే 17, 2024 వేసవి సెలవులకు ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర నిర్వాహకులు అధికారికంగా నిర్ణయించారు.ఈ సినిమాలో 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి కథానాయికగా నటిస్తుండగా, ఇంకొక నటి అంజలి కీలక పాత్ర పోషిస్తున్నారు. 1960 దశకంలో గోదావరి జిల్లాలలో చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన హింసాత్మక పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఆల్బమ్ నుండి విడుదలైన 'సుట్టంలా సూసి' అనే ఒక పాట ఇప్పటికే వైరల్ అయిన విషయం తెలిసిందే.ఈ సినిమా ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా చేశాయి. ఈ సినిమాలో విశ్వక్ సేన్ చేసిన పాత్ర, అతని గోదావరి యాస, అభిమానులను అలరించనుంది అని అనుకుంటున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సంస్థలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa