అమ్మ పొత్తిళ్లలో హాయిగా నిద్రిస్తోన్న 9 నెలల పాపాయిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన గురించి తెలిసిందే. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై మనసున్న ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేశారు. కంటతడి పెట్టుకున్నారు. ఆ దుర్మార్గుడిని నడిరోడ్డుపై ఉరితీయాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, ఈ ఘటనపై తాజాగా యాంకర్, నటి రష్మి గౌతమ్ స్పందించారు. ఆసక్తికర ట్వీట్ చేశారు. 9 నెలల పసికందుపై జరిగిన ఈ క్రూరమైన చర్య పట్ల రష్మి స్పందించడాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. అలాంటి దుర్మార్గులను నడిరోడ్డుపై ఉరితీస్తేనే మళ్లీ ఇలాంటి తప్పులు జరగవని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏం చేసిందని 9 నెలల పాపపై విధి కక్షగట్టింది
ఆమె బట్టలు అసభ్యకరంగా ఏమైనా వేసుకుందా
ఆమె క్లీవేజ్ షో ఏమైనా చేసిందా
ఆమె తన కాళ్లను ఏమైనా చూపించిందా
ఆమె తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పిందా
ఏం చేసింది ఆమె????’ అని రష్మి తన ట్వీట్లో పేర్కొన్నారు. అంటే అభంశుభం తెలియని 9 నెలల పాప ఏం తప్పు చేసిందని ఆ దేవుడు ఇలాంటి శిక్ష విధించాడని పరోక్షంగా రష్మి తన ఆవేదనను వెల్లబుచ్చారు.
కాగా, హన్మకొండలోని టైలర్ స్ట్రీట్ పాలజెండా ప్రాంతంలో జగన్, రచన అనే దంపతులు నివసిస్తున్నారు. రచన గతేడాది ఆడబిడ్డకు జన్మనివ్వగా శ్రిత అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆ పాప వయస్సు 9 నెలలు. ఇంట్లో ఉక్కపోతగా ఉండటంతో ఆ దంపతులు మంగళవారం రాత్రి భవనంపైన నిద్రించారు. ఈ విషయాన్ని గమనించిన ప్రవీణ్ అనే యువకుడు అర్ధరాత్రి వేళ చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాప ఏడుస్తుండటంతో చంపేశాడు.
చిన్నారి పక్కన లేకపోవడంతో కంగారుపడిన జగన్, రచన చుట్టపక్కల వెతికారు. ఓ నిర్మానుష్య ప్రాంతంలో ప్రవీణ్ పాపతో కనిపించడంతో అతడిని చితక్కొట్టి చిన్నారిని సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే పాప అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ప్రవీణ్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa