విజయ్ కనకమేడల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'భైరవం' అనే టైటిల్ తో ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం తమిళ బ్లాక్బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్తో పాటు మంచు మనోజ్ మరియు నారా రోహిత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఈ ముగ్గురు నటీనటులు స్క్రీన్ను పంచుకునే అవకాశం అభిమానులలో మరియు సినీ ఔత్సాహికులలో విపరీతమైన ఉత్సాహాన్ని సృష్టించింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో ప్రముఖ నటుడు సంపత్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో నటుడు పార్ధ సారధి అనే పాత్రలో నటిస్తున్నట్లు మూవీ మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో నారా రోహిత్ వరద అనే పాత్రలో నటిస్తుండగా, మంచు మనోజ్ గజపతి అనే పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళై, ఆనంది కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఉన్నారు. ఈ చిత్రానికి సంభాషణలు సత్యర్షి మరియు తూమ్ వెంకట్అం దించగా, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ మరియు తిరుపతి సాహిత్యం అందించారు. పెన్ స్టూడియోస్కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa