నటుడు విశాల్ (Vishal) ఆరోగ్యంపై ఇటీవల సోషల్మీడియాలో ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. వీటిపై తాజాగా ఆయన స్పందించారు. శనివారం సాయంత్రం 'మద గజ రాజ' ప్రీమియర్కు హాజరై..తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు.''మా నాన్న అంటే నాకెంతో ఇష్టం. ఆయన వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నా. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. ఈ విషయాన్ని ఇప్పుడు ఎందుకు చెబుతున్నానంటే.. మూడు లేదా ఆరు నెలలకొకసారి సినిమాల నుంచి విశ్రాంతి తీసుకుని వెళ్లిపోతున్నానని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం . అంతా బాగానే ఉంది. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. మైక్ కూడా కరెక్ట్గా పట్టుకోగలుగుతున్నా. ఇటీవల మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా తుది శ్వాస వరకూ మీ అభిమానాన్ని మర్చిపోను. గెట్ వెల్ సూన్, కమ్ బ్యాక్ అంటూ మీరు పెట్టిన సందేశాలు కోలుకునేలా చేశాయి'' అని విశాల్ తెలిపారు. ఇటీవల జరిగిన ఈవెంట్తో పోలిస్తే ఇందులో ఆయన ఆరోగ్యంగా, ఫిట్గా కనిపించారు.విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'మదగజరాజ' (Madha Gaja Raja). ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా గత వారం చెన్నైలో చిత్రబృందం ప్రత్యేక ఈవెంట్ నిర్వహించింది. ఇందులో విశాల్ పాల్గొన్నారు. సినిమా గురించి మాట్లాడుతున్న సమయంలో ఆయన చేతులు వణికాయి. పూర్తి నీరసంగా కనిపించారు. దీంతో ఈవెంట్లో పాల్గొన్న వారు కంగారు పడ్డారు. దీనిపై యాంకర్ మాట్లాడుతూ.. విశాల్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారని చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్గా మారాయి. విశాల్కు ఏమైంది? అంటూ స్థానిక, ఆంగ్ల పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. దీనిపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. గెట్ వెల్ సూన్ అంటూ పలువురు పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే ఆయన టీమ్ వైద్యుల రిపోర్ట్ను విడుదల చేసింది. ఆయన వైరల్ ఫీవర్తో ఇబ్బందిపడుతున్నట్లు టీమ్ వెల్లడించింది.సుందర్.సి దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు 12 ఏళ్ల క్రితమే పూర్తైనప్పటికీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైంది. అంజలి, వరలక్ష్మి శరత్కుమార్ కథానాయికలుగా నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa