ప్రముఖ నటుడు సోనుసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్లోని లుథియానా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ షేర్ కావడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాజాగా దీనిపై పోస్ట్ పెట్టారు.‘‘సోషల్ మీడియా వేదికగా హల్చల్ చేస్తున్న వార్తపై సంచలనాత్మకమైన విషయాలను స్పష్టంచేయాలి. విషయం సూటిగా చెప్పాలంటే నాకు ఎటువంటి సంబంధం లేని అంశం విషయంలో కోర్టు నన్ను సాక్షిగా పిలిచింది. మా న్యాయవాదులు కోర్టుకు సమాధానమిచ్చారు. ఫిబ్రవరి 10న దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాను. నా ప్రమేయం లేని విషయాలను మీ అందరికీ స్పష్టంగా వివరిస్తాను. ఆ కేసుకు, నాకు ఏవిధమైన సంబంధం లేదు. దీనిపై మీడియా అనవసరంగా దృష్టి సారిస్తుంది. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం బాధాకరం’’ అని రాసుకొచ్చారు.ఇక లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్ను సాక్షిగా పేర్కొన్నారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు సోనూసూద్కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ‘‘సోనుసూద్కు పలుమార్లు సమన్లు పంపించినప్పటికీ అతను హాజరుకాలేదు. వెంటనే అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి’’ అని ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa