ప్రసిద్ధ గాయకుడు కె.జె. యేసుదాస్ (K.J. Yesudas) ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వైరలవుతున్న విషయం తెలిసిందే. ఉన్నట్టుండి అస్వస్థతకు లోనుకావడంతో ఆయనను చెన్నై నగరంలోని ఓ ప్రైవేట్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్చినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ వార్తలపై ఆయన తనయుడు విజయ్ యేసుదాస్ క్లారిటీ ఇచ్చాడు. యేసుదాస్ ఆస్పత్రిలో చేరినట్లు వస్తున్న వార్తలు అబద్దమని.. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు విజయ్ వెల్లడించాడు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యేసుదాస్ ప్రస్తుతం అమెరికాలో ఆరోగ్యంగా ఉన్నారు. ఆస్పత్రిలో చేరినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం. ఇలాంటి వార్తలను అభిమానులు నమ్మవద్దని యేసుదాస్ కోరినట్లు విజయ్ తెలిపాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa