ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ సమయంలో ఆమె నాకెంతో సాయంగా నిలిచింది

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 13, 2025, 12:04 PM

కెరీర్‌ బిగినింగ్‌లో సవాళ్లు ఎదుర్కోవడం ఎలాంటి ఆర్టిస్ట్‌కైనా సహజమే. ఇప్పుడు ఎంత పెద్ద స్టార్‌ అయినా కావచ్చు కెరీర్‌ బిగినింగ్‌లో ఇబ్బందులు సహజంగానే ఉంటాయి. మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన సమయంలో తాను ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నట్లు చెప్పారు నటి దియా మీర్జా. ఆ సమయంలో చేతిలో డబ్బుల్లేక ఇబ్బందిపడ్డానని ఆమె అన్నారు. ‘2000లో నేను, ప్రియాంకా చోప్రా, లారా దత్తా.. మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రియాంకకు కుటుంబ సభ్యుల నుంచి ఎంతో సపోర్ట్‌ ఉండేది. మాకు సపోర్ట్‌ చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు. మోడలింగ్‌లో రాణిస్తోన్న కారణంగా అప్పటికే లారా ముంబయిలో ఒక ఇరికింట్లో అద్దెకు ఉండేది. నేను ముంబయి వచ్చినప్పుడు.. ఆమె నాకెంతో సాయంగా నిలిచింది. తన రూమ్‌లో ఉండేందుకు అవకాశం కల్పించింది. చిన్న ఇల్లే అయినప్పటికీ మేమిద్దరం సర్దుకుపోయాం. ఫ్యాషన్‌ షోల్లో పాల్గొని.. ఖరీదైన దుస్తులు ధరించి నప్పటికీ ఒక్కోసారి చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. చాలీచాలని డబ్బుతోనే జీవితాన్ని కొనసాగించాం. కొన్నిసార్లు నూడుల్స్‌ తిని కడుపు నింపుకున్నాం. అలా చాలా రోజులు గడిపాం. మా పరిస్థితిని తలుచుకొని నవ్వుకునేవాళ్లం. ఖరీదైన దుస్తులు వేసుకున్నా.. తినేది మాత్రం నూడుల్స్‌ అనుకునేవాళ్లం’’ అని దియామీర్జా ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. 2000 మిస్‌ ఇండియా పోటీల్లో లారా దత్తా విజేతగా కిరీటాన్ని అందుకోగా.. ఫస్ట్‌ రన్నరప్‌గా ప్రియాంకా చోప్రా, సెకండ్‌ రన్నరప్‌గా దియా మీర్జా నిలిచారు. 2001లో విడుదలైన ‘రెహ్నా హై తేరే దిల్‌ మే’తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు దియా మీర్జా. అనంతరం ఆమె బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేశారు. 2021లో విడుదలైన ‘వైల్డ్‌ డాగ్‌’ సినిమాలో ఆమె నటించారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa