ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'బ్రహ్మాస్త్ర-2' పై స్పందించిన రణబీర్ కపూర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 11:33 AM

రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్, అక్కినేని నాగార్జున తదితరులు కీలక పాత్రలు పోషించిన సినిమా 'బ్రహ్మాస్త్ర' . కరణ్‌ జోహార్ నిర్మించిన ఈ సినిమాను అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ సినిమా డబ్ అయ్యింది. అయితే... భారీ అంచనాలతో రూపుదిద్దుకున్న ఈ సినిమా అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. అప్పుడే 'బ్రహ్మాస్త్ర-2' కూడా ఉంటుందని మేకర్స్ చెప్పారు. కానీ తొలిభాగానికి ఆశించిన స్థాయిలో విజయం దక్కకపోవడంతో... రెండో భాగం ఉంటుందా ఉండదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఇటు ఆ చిత్ర కథానాయకుడు, దర్శకుడు ఇద్దరూ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీ అయిపోవడంతో ఇక 'బ్రహ్మాస్త్ర -2'ను అటకెక్కించినట్టే అనే వార్తలు బాలీవుడ్ లో బలంగా వినిపించాయి. దానిపై తాజాగా హీరో రణబీర్ కపూర్ పెదవి విప్పాడు. అందరూ అనుకుంటున్నట్టుగా 'బ్రహ్మాస్త్ర-2' సినిమా ఆగిపోలేదని స్పష్టం చేశాడు. అయితే... దర్శకుడు అయాన్ ముఖర్జీ... హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న 'వార్ -2' సినిమాతో బిజీ ఉన్నారని, ఒక్కసారి ఆ సినిమా విడుదలై పోయిన తర్వాత 'బ్రహ్మాస్త్ర-2' పైనే ఆయన ఫోకస్ పెడతాడని అన్నారు. తమ చిత్రం ఆలస్యమౌతోంది తప్పితే ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com