ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో 'మ్యాడ్‌స్క్వేర్‌' టికెట్‌ ధరల పెంపునకు అనుమతి

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 11:04 AM

నార్నె నితిన్, సంగీత్‌ శోభన్, రామ్‌ నితిన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మ్యాడ్‌ స్క్వేర్‌’. కళ్యాణ్ శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా మ్యాడ్‌ స్క్వేర్‌ సినిమా టికెట్‌ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.75 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. విడుదలైన రోజు నుంచి ఏడు రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉంటాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com