ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోపీచంద్‌ సరసన హీరోయిన్‌గా రితికా నాయక్‌ ?

cinema |  Suryaa Desk  | Published : Thu, Mar 27, 2025, 04:19 PM

గోపీచంద్‌  హీరోగా ‘ఘాజీ’ ఫేమ్‌ సంకల్ప్‌ రెడ్డి  దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. శ్రీనివాస్‌ చిట్టూరి నిర్మాతగా ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో మొదలైంది.  త్వరలోనే రెగ్యులర్‌ షూట్‌కి వెళ్లనుంది. అయితే ఈ చిత్రం గోపీచంద్‌ సరసన హీరోయిన్‌గా రితికా నాయక్‌ని (Rithika Nayak) ఎంచుకొన్నారు. బుధవారం ఇద్దరిపై ఫొటోషూట్‌ నిర్వహించారని తెలిసింది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమాతో అలరించింది రితికి. ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల మొదలైన వరుణ్‌ తేజ్‌ 15 చిత్రంలో కథానాయికగా తీసుకున్నారు. ఈ చిత్రానిక ‘కొరియన్‌ కనకరాజు’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. ఆ సినిమా మొదలైందో లేదో.. మరో ఛాన్స్‌ కొట్టేసింది రితికా నాయక్‌.  


గోపీచంద్‌ 33వ సినిమా ఇది. సంకల్ప్‌ దర్శకత్వంలో చారిత్రక నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిసింది. 7వ శతాబ్దంలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. విజువల్స్‌, మేకింగ్‌ విషయంలో సంకల్ప్‌ ప్రత్యేక దృష్టిని పెడుతున్నారు. తన కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇతర  విషయాలు తెలియాల్సి ఉంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com