బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సౌత్ ఇండియా ప్రేక్షకులకు మాపై ప్రేమ ఉంటుందని, కానీ మా సినిమాలు థియేటర్కు వెళ్లి చూడరని అన్నారు. అందుకే బాలీవుడ్ సినిమాలు సౌత్ ఇండియాలో ఆడట్లేదని తెలిపారు. కానీ సికిందర్ మూవీతో ఆ వెలితి తీరుతుందని పేర్కొన్నారు. కాగా సల్మాన్ ఖాన్, రష్మికా మందన్న కలిసి నటించిన మూవీ సికిందర్. రంజాన్ సందర్భంగా ఈ మూవీ విడుదల కానుంది.సల్మాన్ కామెంట్స్పై సోషల్ మీడియా వేదికగా సౌత్ ఆడియన్స్ విమర్శలు చేస్తున్నారు. తాము చూడకుండానే ప్రేమపావురాలు, ప్రేమాలయం, క్రిష్, త్రీ ఇడియట్స్, బజరంగీ భాయ్జాన్, ధూమ్, ధూమ్ 2 సినిమాలు ఇక్కడ హిట్ అయ్యాయా.? అంటూ ప్రశ్నిస్తున్నారు.
![]() |
![]() |