అజిత్కుమార్ హీరోగా రూపొందిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్ర నిర్మాతలు రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని పేర్కొంటూ ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా నోటీసులు జారీ చేశారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించగా, ఈ నెల 10వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. అయితే, గతంలో ‘నాట్టుపురపాట్టు’, సకలకళా వల్లవన్’, ‘విక్రమ్’ సినిమాలకు తాను స్వరాలు సమకూర్చిన మూడు పాటలను ఈ మూవీలో తన అనుమతి లేకుండా రీ క్రియేట్ చేశారని ఇళయరాజా నోటీసుల్లో పేర్కొన్నారు. అందుకుగాను రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతేగాక ఆ పాటలను తొలగించడంతో పాటు నిర్మాతలు క్షమాపణ చెప్పాలని ఇళయరాజా పంపిన నోటీసుల్లో పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa