ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్

cinema |  Suryaa Desk  | Published : Mon, Apr 28, 2025, 09:26 AM

టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తన కొత్త ప్రాజెక్ట్ ని "చావు కబురు చాలగా" అనే హిట్ చిత్రానికి పేరుగాంచిన కౌశిక్ పెగళ్లపాటితో ప్రకటించారు. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ ని విడుదల చేసి టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రానికి 'కిష్కీందపు'రి అనే టైటిల్ ని లాక్ చేసినట్లు ప్రకటించారు. ఈ చిత్రం యొక్క ఫస్ట్ గ్లింప్సె ఏప్రిల్ 29, 2025న విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. శ్రీమతి షైన్ స్క్రీన్స్ బ్యానర్‌లో ప్రొడక్షన్ నెం. 8ని అర్చన సమర్పిస్తున్నారు. చిన్మయ్ సలాస్కర్ కెమెరా క్రాంక్ చేయనుండగా, కాంతారా ఫేమ్ బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిభావంతులైన అజనీష్ లోక్‌నాథ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa