బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ రాబోయే చిత్రం 'రైడ్ 2' లో కనిపించనున్నాడు. ఈ చిత్రం మే 1, 2025న విడుదల కానుంది. ఇది 2018 హిట్కు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్. రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు ఫియర్లెస్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అమాయ్ పాట్నాయక్ గా కనిపించనున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా యొక్క థియేట్రికల్ ట్రైలర్ మూవీ పై భారీ హైప్ ని క్రియేట్ చేసింది. తాజాగా ఇప్పుడు మేకర్స్ ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యినట్లు ప్రాకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో రితేష్ దేశముఖ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో వాని కపూర్, రాజత్ కపూర్, సౌరభ్ శుక్లా కూడా నటించారు మరియు తమన్నా భాటియా ప్రత్యేక పాటలో కనిపించనున్నారు. అమిత్ త్రివేది ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. పనోరమా స్టూడియోస్ మరియు టి-సిరీస్ ఫిల్మ్స్ ఈ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa