విజయనగరంలో ఉన్న స్థానిక హిమగిరి థియేటర్ లో రీసెంట్గా విడుదల అయ్యి విజయవంతమైన 'గుణ 369' సినిమా చిత్ర బృందం పర్యటించి , ప్రేక్షకులను కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో హీరో ఆర్ఎక్స్100 సినిమా హీరో కార్తికేయ , హీరోయిన్ అనఘ, ప్రముఖ కమెడియన్ మహేష్, దర్శకుడు అర్జున్ జంధ్యాల పాల్గొని సినిమా విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ముందుగా హీరో కార్తికేయ మాట్లాడుతూ తన మొదటి ఆర్ఎక్స్100 సినిమా విజయ యాత్రలో భాగంగా విజయనగరం వచ్చానని, ఇప్పుడు తన మరో సినిమా గుణ 369 సినిమాకి మళ్ళీ రెండో సారి విజయనగరం రావడం చాలా సంతోషంగా ఉంది అని తెలిపారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పటికి ఆదరిస్తారని మరోసారి రుజువు చేశారన్నారు. మంచి కథ , కధనం ఉన్న ఇలాంటి మరిన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తానని తెలిపారు. అలాగే వచ్చే నెలలో ప్రముఖ హీరో నానితో కలిసి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా విడుదల అవుతుందని, అలాగే తన సొంత బ్యానర్ లో ఒక్క సినిమా, గుణ 369 సినిమా దర్శకుడుతో మరో సినిమాలో నటిస్తానను అని తెలిపారు. అనంతరం ప్రేక్షకులు కోరిక మేరకు గుణ 369 సినిమా నుండి తన డైలాగులు చెప్పి అలరించారు. హీరోయిన్ అనఘ మాట్లాడుతూ తను ఇప్పటికే మలయాళంలో నటించానని తెలుగులో నటించిన తన మొదటి సినిమా ఇంత ఘన విజయం సాధించడం మర్చిపోలేని అనుభూతి అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa