ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విడుదల తేదీని లాక్ చేసిన 'భైరవం'

cinema |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 05:27 PM

తెలుగు హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన రాబోయే చిత్రం 'భైరవం' తో ప్రేక్షకులని అలరించనున్నారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మూవీ పై భారీ హైప్ ని క్రైట్ చేసింది. నారా రోహిత్ మరియు మనోజ్ మంచు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం ఈ సినిమా యొక్క విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాని మే 30న విడుదల చేస్తున్నట్లు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్టర్ ని విడుదల చేసింది. అదితి శంకర్, ఆనంది మరియు దివ్య పిళ్లై మహిళా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె.రాధామోహన్ నిర్మించగా, పెన్ స్టూడియోస్ పతాకంపై డాక్టర్ జయంతిలాల్ గడ సమర్పిస్తున్నారు. ఈ సినిమా తమిళ బ్లాక్‌బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa