ప్రముఖ నటుడు నవీన్ చంద్ర అత్యంత ప్రతిష్టాత్మకమైన "ఎలెవెన్" చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నాడు. లోకేశ్ అజ్ల్స్ దర్శకత్వం వహించిన ఈ తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ప్రేక్షకులను వారి సీట్ల అంచున ఉంచే ఒక రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని సమాచారం. ఈ సినిమా యొక్క టీజర్ సినిమా పై భారీ అంచనాలని పెంచింది. ప్రతి ఒక్కరూ "ఎలెవెన్" విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం మే 16, 2025లో విడుదల కానుంది. ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకి హైదరాబాద్ లోని ఐటీసీ కోహినూర్ లో జరగనుంది. తాజాగా ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ట్రాక్ లో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్స్ గా టాలీవుడ్ నటులు శ్రీ విష్ణు, సందీప్ కిషన్ మరియు స్టార్ డైరెక్టర్ సాయి రాజేష్ మరియు శ్రీకాంత్ హాజరుకానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమా అభిరామి, శశాంక్, దిలీపన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. AR ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa