తమిళ బ్లాక్బస్టర్ గరుడన్ యొక్క అధికారిక తెలుగు రీమేక్కు 'భైరవం' పేరుతో మే 30న విడుదల కానుంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్తో పాటు మంచు మనోజ్ మరియు నారా రోహిత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క థర్డ్ సింగల్ ని డూమ్ దుమారే విడుదల చేసారు. తాజాగా ఇప్పుడు ఈ సినిమా సాంగ్ 2.5 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉన్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో అదితి శంకర్, దివ్య పిళై, ఆనంది కీలక పాత్రలలో నటిస్తున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ హరి కె వేదాంతం, మ్యూజిక్ కంపోజర్ శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి ఉన్నారు. ఈ చిత్రానికి సంభాషణలు సత్యర్షి మరియు తూమ్ వెంకట్ అందించగా, భాస్కర భట్ల, కాసర్ల శ్యామ్, చైతన్య ప్రసాద్, బాలాజీ మరియు తిరుపతి సాహిత్యం అందించారు. యాక్షన్తో కూడిన సన్నివేశాలకు ఫైట్ మాస్టర్స్ రామకృష్ణ మరియు నటరాజ్ మాడిగొండ కొరియోగ్రఫీ చేస్తున్నారు. పెన్ స్టూడియోస్కు చెందిన డాక్టర్ జయంతిలాల్ గదా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు సందీప్ రాజ్, అజయ్, శరత్, జయసుధ, సంపత్ రాజ్, గోపరాజు రమణ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa