పాన్-ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ అయిన "గగన మార్గన్"లో విజయ్ ఆంటోనీ తదుపరి కనిపించనున్నారు. "హిట్లర్" వంటి చిత్రాలలో తన ఆకర్షణీయమైన నటనకు పేరుగాంచిన బహుముఖ నటుడు ఇప్పుడు ఈ చిత్రంతో ప్రేక్షకులని అలరించనున్నారు. ఈ పాన్-ఇండియన్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రఖ్యాత ఎడిటర్ లియో జాన్ పాల్ దర్శకత్వ అరంగేట్రం చేస్తున్నారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ ని ఈరోజు సాయంత్రం 5 గంటలకి వెల్లడించనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ సినిమాలో మెయిన్ విలన్ గా అజయ్ ధిషన్ నాటిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ ఆంటోనీతో పాటు సముద్రఖని, మహానటి శంకర్, ప్రితిక, బ్రిగిడా సాగా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు ఎవరు అర్చన, కనిమొళి మరియు అంతగారం నటరాజన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. విజయ్ ఆంటోని హోమ్ బ్యానర్, విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్పై 12వ ప్రొడక్షన్గా ఈ చిత్రాన్ని పరిచయం చేసారు. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్గా విజయ్ ఆంటోని ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa