ప్రముఖ రాజకీయ నాయకుడు జానార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాధా కృష్ణ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'జూనియర్' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని లెట్స్ లైవ్ ది మూమెంట్ అనే టైటిల్ తో మే 19న అంటే ఈరోజు మధ్యాహ్నం 12:09 గంటలకి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పాన్-ఇండియన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ లో శ్రీలీల మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రంలో జెనీలియా, రవిచంద్రన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక వారాహి చలానా చిత్రం బ్యానర్ ఆధ్వర్యంలో రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. ఈ సినిమా జూలై 18, 2025న విడుదల కానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa